ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు.. ముంపు ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... తమకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు జిల్లాల రైతులను దృష్టిలో ఉంచుకుని తాము ఇళ్లు, పొలాలు వదులుకుంటున్నామని వాపోయాడు. అయినప్పటికీ ప్యాకేజీ ఇవ్వడంలో ప్రభుత్వం.. తమను చిన్న చూపు చూస్తుందని ఆరోపించాడు. ముంపు ప్రాంతాల రైతులను ఉద్దేశించి కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడిన మాటలు మనస్తాపానికి గురి చేశాయన్నాడు.
'ముంపు బాధితులకు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలి'
ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మితమవుతున్న వెలిగొండ ప్రాజెక్టు ముంపు బాధితులను ఆదుకోవాలని.. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయమైన ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
!['ముంపు బాధితులకు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలి' prakasam district farmer protest to Provide financial package for veligonda victims](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7799061-1078-7799061-1593273478219.jpg)
'ముంపు బాధితులకు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలి'