ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని వెలిగొండ అటవీ ప్రాంతంలోకి ముగ్గురు వ్యక్తులు ఆదివారం ప్రవేశించారు. గుప్త నిధికోసం వేటకు వారు బయలు దేరారు. తిరిగి రావటానికి దారిని మరిచిపోయారు. తీసుకెళ్లిన నీళ్లు అయిపోయాయి. బయటికి వచ్చేందుకు నానా అవస్థలూ పడ్డారు. కానీ ఫలితం లేదు. వారిలో ఓ వ్యక్తి సురక్షితంగా బయట పడ్డాడు. మరొకరు శవమై తేలారు. కానీ ఇంకొకరి ఆచూకీ తెలియలేదు.దీంతో హనుమంతు నాయక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అడవిలో పోలీసుల గాలింపు... ఆ వ్యక్తి ఏమైనట్టు?
నిధి వేటలో గల్లంతైన వ్యక్తి కోసం పోలీసుల గాలింపు ముమ్మరమైంది. అత్యాశతో ముగ్గురు అడవికెళ్లగా ఒకరు చనిపోయారు. మరొకరు జనావాసంలోకి రాగా... మరొకరి ఆచూకీ లభ్యం కాలేదు. అతని కోసం వేట కొనసాగుతోంది.
పోలీసుల గాలింపు