ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాగుకు రుణాలివ్వాలంటూ కనిగిరిలో రైతుల నిరసన

ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన కొందరు రైతులు ఆంధ్రా బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టారు. ఖరీఫ్​లో ఇవ్వాల్సిన క్రాప్ లోన్లు, టొబాకో బ్యార్నీ లోన్లు త్వరగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

By

Published : Oct 7, 2020, 3:33 PM IST

farmers protest at kanigiri andhra bank to sanction loans for farming at prakasam district
రుణాలు ఇవ్వాలని కనిగిరిలో రైతులు నిరసన

ప్రకాశం జిల్లా కనిగిరి మండల కేంద్రంలో రైతులు... ఆంధ్రా బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టారు. సుమారు 20 సంవత్సరాల నుంచి ఆంధ్రా బ్యాంకును నమ్ముకొని పంట రుణాలను తీసుకొంటూ... పంటలను సాగుచేస్తున్నామని తెలిపారు.

సకాలంలో రుణాలు చెల్లించినా... బ్యాంక్ మేనేజర్ లేరన్న సాకు చూపి లోన్​లు ఇవ్వట్లేదని వాపోయారు. ఖరీఫ్​లో ఇవ్వాల్సిన క్రాప్ లోన్లు, టొబాకో బ్యార్నీ లోన్లు త్వరగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా బ్యాంకుకు త్వరగా మేనేజర్​ని నియమించి రుణాలను మంజూరు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details