ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 25, 2021, 9:25 PM IST

ETV Bharat / state

వార్డుల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాసరావు

చీరాల పట్టణంలోని వార్డుల్లోని ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు అన్నారు. వైస్ ఛైర్మన్ బొనిగల జైసన్​బాబు, మున్సిపల్ కమిషనర్ పి.యేసయ్యలతో కలిసి పట్టణంలో ఆయన పర్యటించారు.

muncipal chairman janjanam srinivas
మున్సిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు

నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం కోసం కృషి చేస్తానని ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు తెలిపారు. వైస్ ఛైర్మన్ బొనిగల జైసన్​బాబు, మున్సిపల్ కమిషనర్ పి.యేసయ్యతో కలిసి పట్టణంలో పర్యటించారు.

కాలనీల్లోని డ్రైనేజీ సమస్యలు, పాడయిన రహదారులు, పారిశుద్ధ్యం, పలు రకాల సమస్యలు ప్రజలను కలసి అడిగి తెలుసుకున్నారు. అధికారులతో చర్చించి, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీఓ శ్రీనివాస్, శానిటరీ సిబ్బంది, వార్డుల్లోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details