ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎంసెట్​లో ఉత్తీర్ణుడు కాలేదని.. విద్యార్థి బలవన్మరణం

By

Published : Oct 11, 2020, 6:02 PM IST

ఎంసెట్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయినే మనస్థాపంతో ప్రకాశం జిల్లా వేటపాలెంలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎంసెట్​లో ఉత్తీర్ణడు కాలేదని విద్యార్థి బలవన్మరణం
ఎంసెట్​లో ఉత్తీర్ణడు కాలేదని విద్యార్థి బలవన్మరణం

ఎంసెట్ లో ఉత్తీర్ణత సాధించలేదన్న మనస్థాపంతో ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెంలో జరిగింది. వేటపాలెం రావూరు రోడ్డులో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు ప్రసన్న లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో చివరి సంతానం బండరు ఉదయ్ చీరాలలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు.

42 రాలేదని..

ఎంసెట్ పరీక్షా ఫలితాల్లో కనీస అర్హత 42 మార్కులు రావాల్సి ఉండగా 32 మార్కులు మాత్రమే రావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఫలితంగా గదిలో ఆత్మహత్య పాల్పడ్డాడు. చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడం వల్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

చీరాల ఆస్పత్రికి..

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వ్తెద్యశాలకు తరలించారు.

ఇవీ చూడండి:

దారుణం: పింఛను సొమ్ము కోసం కన్నతల్లిని చంపిన కర్కశుడు

ABOUT THE AUTHOR

...view details