ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఈఎస్ఐ కుంభకోణంలో మంత్రి పాత్రపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి'

By

Published : Sep 23, 2020, 6:47 PM IST

ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడును ఉద్దేశపూర్వకంగా ఇరికించారని నెల్లూరులోని తెదేపా నాయకులు అన్నారు. బెంజ్ కారు విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

tdp leaders comments on benz car issue at nellore
ఏసీబీకి తెదేపా నేతల వినతిపత్రం


ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి ఏసీబీ సమగ్ర దర్యాప్తు చేపట్టాలని తెదేపా డిమాండ్ చేసింది. నెల్లూరులో ఏసీబీ కార్యాలయంలో డీఎస్పీ దేవానంద్ శాంత్రోకి తెదేపా నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈఎస్ఐ కుంభకోణంలో మంత్రి జయరాం పాత్ర ఉందని, ఆయన కుమారుడు ఈశ్వర్ బెంజ్ కారును బహుమతిగా తీసుకున్నట్లు బయటపడిందని తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. బెంజ్ కారును తీసుకున్న విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. తెదేపా నేత అచ్చెన్నాయుడును ఈఎస్ఐ కుంభకోణంలో అనవసరంగా ఇరికించారని మండిపడ్డారు. ఈఎస్ఐ కుంభకోణంలో జయరామ్ పాత్రపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details