ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 28, 2020, 12:14 PM IST

ETV Bharat / state

రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు 60 మంది ప్రయత్నం

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారిని పోలీసులు వెనక్కు పంపుతున్నారు. ఇవాళ నెల్లూరు జిల్లాలోని ఉదయగిరికి బెంగళూరు నుంచి 60 మంది వరకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వారిని తిరిగి వెనక్కి పంపారు.

some-have-came-to-ap-from-other-states-and-police-sent-them-back
some-have-came-to-ap-from-other-states-and-police-sent-them-back

రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు 60 మంది ప్రయత్నం

కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరికి వచ్చిన మూడు టెంపో వాహనాలను పంచాయతీ బస్టాండ్​ వద్ద పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారు. ప్రకాశం జిల్లా పామూరుకి రావడానికి 60 మంది బెంగళూరు నుంచి మూడు టెంపో వాహనాల్లో బయలుదేరారు. మార్గ మధ్యంలో ఉదయగిరి పంచాయతీ బస్టాండ్​ వద్ద ఆగారు.

వాహనాల్లో వచ్చిన వ్యక్తులు కిందకి దిగి బస్టాండ్ కూడలిలో సంచరిస్తుండగా గమనించిన స్థానికులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై జ్యోతి తన సిబ్బందితో కలిసి బస్టాండ్​కు చేరుకున్నారు. లాక్​డౌన్ ఉంటే బెంగళూరు నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు అంటూ వారిని ప్రశ్నించారు. వెంటనే వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించి వాహనాలను సరిహద్దు దాటించే ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:విశాఖను కలవరపెడుతున్న కరోనా.. ఇప్పటికే 4 పాజిటివ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details