అమరులైన 44 మంది వీర జవానులకు నెల్లూరులో ఘన నివాళి అర్పించారు.
By
Published : Feb 18, 2019, 5:12 PM IST
vhp protesters
అమరులకు ఘన నివాళి
పుల్వామా ఘటనలో అమరులైన జవాన్లకు నెల్లూరు జిల్లా వాసులు నివాళి అర్పించారు. నాయుడు పేట పుర వీధుల్లో కొవ్వత్తులతో ర్యాలీ చేశారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు. విశ్వహిందూ పరిషత్, ఆర్.ఎస్.ఎస్, భజరంగ దళ్, ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.