ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజృంభిస్తున్న కరోనా.. నెల్లూరు నగరంలో లాక్​డౌన్

By

Published : Jul 23, 2020, 9:30 PM IST

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో నెల్లూరు నగరంలో శుక్రవారం నుంచి లాక్​డౌన్ అమలు కానుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే నిత్యావసరాలకు అనుమతి ఇస్తారు.

nellore corona cases
nellore corona cases

నెల్లూరు నగరంలో శుక్రవారం నుంచి లాక్​డౌన్ అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని జిల్లా కలెక్టర్ చక్రదర్ బాబు కోరారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. ఆ తరువాత ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details