మహానందిలో ఘనంగా వరుణయాగం
వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కర్నూలులోని మహానందీశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం జరిగింది. పెద్దఎత్తున భక్తులు హాజరైన ఈ యాగంలో కోనేరు లోని పవిత్రజలాలతో స్వామికి అభిషేకం చేశారు. భారీగా తరలి వచ్చిన భక్త జనానికి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.