ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆగివున్న ట్రాక్టర్​ను ఢీ కొట్టిన ద్విచక్రవాహనం.. ఇద్దరు మృతి

అతివేగం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్న ఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేట సమీపంలో జరిగింది. ట్రాక్టర్​ను రోడ్డు పక్కన నిలిపి ఓ వ్యక్తి బాగుచేస్తున్నాడు. అంతలో ఓ ద్విచక్రవాహనం అతివేగంగా వచ్చి ఆగిఉన్న ట్రాక్టర్​ని, దాన్ని బాగుచేస్తున్న వ్యక్తిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నడిపిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తన పని తాను చేసుకుంటున్న మరో వ్యక్తి సైతం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణిచాడు.

By

Published : Feb 18, 2021, 5:24 PM IST

two persons died in road accident
ఆగివున్న ట్రాక్టర్​ను ఢీకొన్న ద్విచక్రవాహనం

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. తిమ్మనాయునిపేట వద్ద గోవింద్​ అనే వ్యక్తి ట్రాక్టర్ పంక్చర్ అయ్యింది. రోడ్డు పక్కకు వాహనం నిలిపి బాగుచేస్తున్నాడు. బి.ఉప్పులూరుకు చెందిన రవి.. ద్విచక్రవాహనంపై వచ్చి గోవింద్​ను బలంగా ఢీకొట్టాడు.

అదుపుతప్పి ఆగివున్న ట్రాక్టర్​ను సైతం ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలైన గోవింద్​ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details