కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. తిమ్మనాయునిపేట వద్ద గోవింద్ అనే వ్యక్తి ట్రాక్టర్ పంక్చర్ అయ్యింది. రోడ్డు పక్కకు వాహనం నిలిపి బాగుచేస్తున్నాడు. బి.ఉప్పులూరుకు చెందిన రవి.. ద్విచక్రవాహనంపై వచ్చి గోవింద్ను బలంగా ఢీకొట్టాడు.
అదుపుతప్పి ఆగివున్న ట్రాక్టర్ను సైతం ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలైన గోవింద్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.