పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా.. కొండారెడ్డి బురుజు వద్ద కర్నూలు ఎస్పీ ఫిక్కీరప్ప, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మారథాన్ ప్రారంభించారు. రాజ్ విహార్ కూడలి, ఆర్.ఎస్.రోడ్డు, కోట్ల సర్కిల్ మీదుగా పోలీసు కార్యాలయం వరకు పరుగు సాగింది. అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత అని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. పోలీసు సేవలను కీర్తించారు.
'అమరవీరులను స్మరించుకోవడం మన బాధ్యత'
కర్నూలులో పోలీసు అమరవీరుల వారోత్సవాలు కొనసాగుతున్నాయి. కొండారెడ్డి బురుజు నుంచి పోలీసు సిబ్బంది మారథాన్ నిర్వహించారు.
police_Immortals_varosthavalu