కర్నూలు జిల్లా బనగానపల్లెలో విషాదం జరిగింది. నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్రం ఐజ మండలం తాండ్రపాడుకు చెందిన కూలీలు.. అక్కడ పాలిష్ పరిశ్రమలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. పరిశ్రమ సమీపంలో ఉన్న నీటిగుంతలో ఆడుకుంటూ గంగాధర్ అనే రెండేళ్ల చిన్నారి మృతిచెందాడు.
Died: నీటి గుంతలో పడి బాలుడి మృతి
నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. కర్నూలు జిల్లా బనగానపల్లెలో పాలిష్ పరిశ్రమ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
boy died
బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి మల్లేశ్వరి కూడా.. నీటి గుంతలో పడింది. స్థానికులు ఆమెను కాపాడి నంద్యాల ఆస్పత్రికి తరలించారు. బనగానపల్లె సీఐ సుబ్బరాయుడు ఘటనా స్థలికి చేరుకుని విచారించారు. నీటి గుంతకు రక్షణ లేనందునే.. బాలుడు మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: