ఆటో డ్రైవర్లకు ఇబ్బందికరంగా ఉన్న జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని... కర్నూలు జిల్లాలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ధర్నా చేశారు. రాజ్ వీహర్ కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ఆటోలతో ప్రదర్శనగా వచ్చారు.
మోటార్ వెహికల్ చట్ట సవరణకు వ్యతిరేకంగా డ్రైవర్లు నినాదాలు చేశారు. నూతన చట్టం అమలు చేస్తే డ్రైవర్లు తమ వృత్తిని వదులుకొని వలస వెళ్లాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.