కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామం వద్ద ప్రవహిస్తున్న వాగులో ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. ఆలమూరు గ్రామానికి చెందిన ఆర్షద్ రోడ్డుపై ప్రవహిస్తున్న వాగును దాటుతుండగా వరద ఉద్ధృతికి కొట్టుకుని పోయాడు. అక్కడి స్థానికులు రక్షించేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. విద్యార్థి ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతుండగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తన ఆచూకి కోసం గాలిస్తున్నారు.
వాగు దాటుతుండగా విద్యార్థి గల్లంతు..
రోడ్డుపై ప్రవహిస్తున్న వాగును దాటుదామనుకున్నాడు. వరద ఉద్ధృతికి తట్టుకోలేక నీటిలో కొట్టుకుపోయాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆలమూరు గ్రామంలో జరిగింది.
వాగు దాటుతుండగా విద్యార్థి గల్లంతు..
ఇదీ చదవండి: