ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాము కాటుకు మరో మహిళ మృతి

కృష్ణా జిల్లాలో పాముకాటుతో మరణించే వారి సంఖ్య ఎక్కుపవుతూనే ఉంది. అవనిగడ్డ నియోజకవర్గంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

By

Published : Sep 4, 2019, 10:25 AM IST

పాము కాటుకు మరో మహిళ మృతి

పాము కాటుకు మరో మహిళ మృతి
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం పెద్దపాలెంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొడ్డు నాగేశ్వరమ్మ పాముకాటుకు గురై మృతి చెందింది. పాము కరిచిన విషయాన్ని కుటుంబసభ్యులకు నాగేశ్వరమ్మ చెప్పడంతో హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

ABOUT THE AUTHOR

...view details