ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బోరు వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి

By

Published : Jul 4, 2020, 10:08 PM IST

కృష్ణా జిల్లా చల్లపల్లిలో విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. బోరు వేస్తుండగా సంఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.

krishna distrct
బోరు వేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై ఇద్దరు మృతి

కృష్ణా జిల్లా చల్లపల్లిలో విషాదం జరిగింది. నారాయణరావు నగర్ లో బోరు వేస్తుండగా విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందారు. బోరు వేసేందుకు ఉపయోగించే ఐరన్ పైపులను పైకి తీస్తుండగా విద్యుత్ లైన్ తగిలింది.

ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు విద్యుదాఘాతానికి గురయ్యారు. బాధితులను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందారు. వారిని మోపిదేవి మండలం బోడగుంటకు చెందినవారిగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details