ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాడి చేశారు.. 4 లక్షలు దోచుకెళ్లారు

విజయవాడలో దొంగలు భీబత్సం సృష్టించారు. అర్థరాత్రి ట్రాన్స్​పోర్ట్ కార్యాలయంలో దూరి 4 లక్షల రూపాయలు దొంగిలించారు.

By

Published : Jul 14, 2019, 4:34 PM IST

విజయవాడ పాతబస్తీలో దొంగల బీభత్సం

విజయవాడ పాతబస్తీలో దొంగల బీభత్సం

విజయవాడలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ముగ్గురు యువకులు అర్థరాత్రి ప్రగతి ట్రాన్స్​పోర్టు గోడౌన్ సిబ్బందిపై దాడిచేశారు. నాలుగు లక్షల రూపాయలు దోచుకున్నారు. గాయాలైన సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన తీరును చూస్తే.. సంస్థ గురించి తెలిసిన వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దోపిడీ జరిగిన ప్రాంతాన్ని డీసీపీ విజయరావు పరిశీలించారు. ట్రాన్స్‌పోర్టులో పనిచేస్తున్న సిబ్బందిని విచారించారు. నిందితుల కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డీసీపీ తెలిపారు. దోపిడీ చేసేముందు నిందితులు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించామని.. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని స్పష్టంచేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details