కృష్ణా బోర్డు ఛైర్మన్కు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పిన్నపురం జలవిద్యుత్ ప్రాజెక్టు ఆపాలని విజ్ఞప్తి చేస్తూ..కేఆర్ఎంబీ ఛైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. కొత్త, ప్రస్తుత ప్రాజెక్టుల విస్తరణ ఆపాలని లేఖలో తెలంగాణ ప్రభుత్వం కోరింది. బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చేపట్టవద్దని విన్నవించింది. లేఖలోని అంశాలను జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని కోరింది.
TS Govt letter to KRMB: కృష్ణా బోర్డు ఛైర్మన్కు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ - కృష్ణా బోర్డు ఛైర్మన్కు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ

18:21 September 28
పిన్నపురం జలవిద్యుత్ ప్రాజెక్టు పనులు ఆపాలని..
కేఆర్ఎంబీ ఛైర్మన్కు ఇప్పటికే తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖలు రాశారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీరు తరలించకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా నీటి తరలింపును కూడా ఆపాలన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటికే 76.39 టీఎంసీలు తరలించారని.. హంద్రీనీవా ద్వారా ఏపీ 9.28 టీఎంసీలు నీరు తరలించారని లేఖలో ప్రస్తావించారు. 1976 ఒప్పందం ప్రకారం ఏపీ 34 టీఎంసీలలోపే తీసుకోవాలని కోరారు.
కృష్ణా బేసిన్కు తాము మళ్లిస్తున్న గోదావరి జలాలను లెక్కించేందుకు టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని, ఆ జలాలను రెండు రాష్ట్రాలకు పంచాలన్న ఏపీ నిరాధార వాదనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది. కృష్ణా బేసిన్కు తెలంగాణ మళ్లిస్తున్న గోదావరి జలాలను లెక్కించేందుకు టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని, ఆ జలాలను రెండు రాష్ట్రాలకు పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేఆర్ఎంబీకి లేఖ రాసింది. దానిపై వివరణ ఇస్తూ తెలంగాణ ఈఎన్సీ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. ఏపీ వాదన నిరాధారమైనదని..సహేతుకం కాని డిమాండ్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి
Badwel bypoll 2021: బద్వేల్ ఉపఎన్నిక.. తెదేపా అభ్యర్థి ఖరారు..వైకాపా నుంచి ఎవరంటే..!