ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 25, 2020, 12:04 PM IST

ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో శ్రీకాకుళం జడ్పీ ఉన్నత పాఠశాలలో దీపక్​ సాయి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదోతరగతి చదువుతున్న దీపక్ సాయి ఉరివేసుకుని చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఘంటసాల పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

student-suicide-in-srikakulam-shool-in-krishna-district
student-suicide-in-srikakulam-shool-in-krishna-district

పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
కృష్ణా జిల్లా, శ్రీకాకుళం హైస్కూల్లో పదోతరగతి చదువుతున్న దీపక్ సాయి పాఠశాల ప్రాంగణంలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి ట్యూషన్​కు వెళ్లిన దీపక్ తెల్లవారేసరికి మృతి చెందాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీపక్ సాయి మొబైల్ ద్వారా చిన్న చిన్న లఘు చిత్రాలు తీసేవాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. దీపక్ చాలా బాగా చదివే వాడని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావడం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. స్కూల్లో నైట్ వాచ్​మెన్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details