ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీజీఎస్ నూతన సీఈవోగా బాలసుబ్రహ్మణ్యం

ఆర్టీజీఎస్ నూతన సీఈవోగా బాలసుబ్రహ్మణ్యం నియమిలయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By

Published : Jul 27, 2019, 1:44 AM IST

Updated : Jul 27, 2019, 4:02 AM IST

సుబ్రమణ్యం

ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యం(పాత చిత్రం)

సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంను రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సీఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రవాణాశాఖ కమిషనర్ గా, ఈ ప్రగతి ప్రాజెక్టు పర్యవేక్షకుడిగా పనిచేసిన బాలసుబ్రహ్మణ్యంను బదిలీల కారణంగా వెయిటింగ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన్ను రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. తెదేపా హయాంలో ఆర్టీజీఎస్ సీఈవోగా అహ్మద్ బాబు ఉండగా... జులై మొదటి వారంలో ఆయన్ను బదిలీ చేసి... ఏపీఐఐసీ వైస్‌ ఛైర్మన్‌ మాదిరెడ్డి ప్రతాప్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. కొద్దిరోజుల వ్యవధిలోనే మళ్లీ అహ్మద్ బాబుకే ఆర్టీజీఎస్ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. మళ్లీ ఈ నెల 23న అహ్మద్ బాబును బదిలీ చేసి.. సాంకేతిక విద్య కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.

Last Updated : Jul 27, 2019, 4:02 AM IST

ABOUT THE AUTHOR

...view details