ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ ఢీ.. వృద్ధురాలు మృతి

మనవరాలిని పాఠశాలలో చేర్పించి తిరిగి వస్తున్న ఓ వృద్ధురాలిని లారీ ఢీ కొట్టిన సంఘటన కృష్ణా జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది.

By

Published : Jun 20, 2019, 8:35 PM IST

లారీ ఢీకొని వృద్ధురాలు మృతి

లారీ ఢీకొని వృద్ధురాలు మృతి

కృష్ణా జిల్లా నూజివీడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కంకిపాడు మండలం దావూలూరుకు చెందిన రోషమ్మ హనమంతుల గూడెంలో నివాసం ఉండే కూతురు వద్దకు వచ్చింది. తన మనవరాలిని పాఠశాలలో చేర్పించి తిరిగి ఇంటికి వెళ్తుండగా నూజివీడు గాంధీబొమ్మ సెంటర్​లో వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వృద్ధురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించిందని ధృవీకరించారు.

ABOUT THE AUTHOR

...view details