ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా నేత ఇంట్లో భారీగా మద్యం స్వాధీనం

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. భారీగా మద్యం, నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. పుత్తూరు కె.బి.ఆర్.పురంలో ఓ ఇంట్లో 65 కేసుల మద్యం సీసాలు గుర్తించారు.

By

Published : Apr 8, 2019, 7:36 AM IST

వైకాపా నేత ఇంట్లోభారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం కె.బి.ఆర్.పురం లో వైకాపా నాయకుడు నాగేశ్వరరాజు ఇంట్లో దాచి ఉంచిన 65 కేసులు మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటి విలువ సుమారు రూ. 3 లక్షల 75 వేల వరకు ఉంటుందని తెలిపారు. పోలింగ్ రోజున ఓటర్లకు సరఫరా చేసేందుకు ఈ మద్యాన్ని నిల్వ ఉంచినట్లు నిర్ధరించారు.

కృష్ణాజిల్లా ఉప్పలూరు రైల్వే గేటు వద్ద 3వేల 264 మద్యం సీసాలతో వెళ్తున్న ఆటోను పట్టుకున్నారు. గుడివాడ నుంచి గన్నవరంకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వైకాపా నేత ఇంట్లోభారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details