ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీఎస్ఎల్వీ సీ-50 విజయవంతంపై గవర్నర్ హర్షం

పీఎస్ఎల్వీ సీ-50 ప్రయోగం విజయవంతంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆనందం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలను అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు.

By

Published : Dec 17, 2020, 7:55 PM IST

governor bishwabhooshan harichandan appreciates  PSLV C-50 experiment successfully
పీఎస్ఎల్వీ సీ-50 విజయవంతంపై గవర్నర్ హర్షం

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం పీఎస్ఎల్వీ సీ-50 ను విజయవంతంగా ప్రయోగించటంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతం చేసిన అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలను ప్రశంసించారు. కరోనా లాక్​డౌన్ తరువాత ఈ ప్రయోగం వారి అంకితభావానికి నిదర్శనమని, భారత అంతరిక్ష పరిశోధనా కార్యక్రమంలో ఇదొక మచ్చుతునక వంటిదని గవర్నర్ హరిచందన్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details