కృష్ణా జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో... చెరువులో పడి తండ్రీకొడుకులు మరణించారు. చేపలు పట్టేందుకు చెరువు మధ్యలోకి వెళ్లగా...ఊబిలో ఇరుక్కున్నారు. గజ ఈతగాళ్లు చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.