ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంకు ఇచ్చిన బాండ్ల విడుదలకు నకిలీ లేఖలు..ఇద్దరు రైస్​మిల్లర్లపై కేసు

కృష్ణా జిల్లా పౌరసరఫరాల శాఖకు సంబంధించిన బియ్యానికి బ్యాంకు గ్యారంటీగా ఇచ్చిన బాండ్ల విడుదలకు ఇద్దరు రైస్ మిలర్లు నకిలీ లేఖలను సృష్టించారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

By

Published : Nov 1, 2021, 8:36 AM IST

నకిలీ లేఖలు
నకిలీ లేఖలు

కృష్ణా జిల్లా పౌరసరఫరాల శాఖకు సంబంధించిన బియ్యానికి బ్యాంకు గ్యారంటీగా ఇచ్చిన బాండ్ల విడుదలకు నకిలీ లేఖలను సృష్టించిన ఇద్దరు రైస్ మిలర్లపై గవర్నర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు.

రైస్ మిల్లర్లు ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి దానికి సంబంధించిన బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు పంపిస్తారు . దీని నిమిత్తం రైస్ మిల్లర్లు పౌరసరఫరాల శాఖకు కొంత సొమ్ము గ్యారంటీ చూపించాల్సి ఉంటుంది. బియ్యం సరఫరా పూర్తయిన తరువాత గ్యారంటీ సొమ్మును వెనక్కి ఇస్తూ జిల్లా పౌరసరఫరాల శాఖ రైస్ మిల్లర్లకు ఒక లేఖ ఇస్తారు. లేఖను బ్యాంకు సమర్పించి తాము గ్యారంటీగా ఇచ్చిన సొమ్మును రైస్ మిల్లర్లు వెనక్కి తీసుకుంటారు.

విజయవాడ రూరల్​కు చెందిన ఇద్దరు రైస్​ మిల్లర్లు 2020-21 సంవత్సరానికి సంబంధించిన రూ. 1 కోటి సొమ్మును గ్యారంటీగా చూపించి ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యం మిల్లింగ్​ చేశారు. దానికి సంబంధించిన మొత్తం బియ్యాన్ని పౌరసరపరాల శాఖకు సరఫరా చేశారు. అయితే బ్యాంకు గ్యారంటీగా చూపిన సొమ్మును వెనక్కి తీసుకునేందుకు పౌరసరఫరాల శాఖ ఇచ్చినట్లుగా ఒక లేఖ సృష్టించి బ్యాంకుకు సమర్పించారు. దీనిపై జిల్లా పౌరసరఫరాల శాఖకు సమాచారం రావటంతో పౌరసరఫరా అధికారులు గవర్నర్​పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:GOVERNOR: నా పేరు వాడుకుంటారా..? గవర్నర్ అసంతృప్తి..

ABOUT THE AUTHOR

...view details