ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 9, 2020, 3:44 PM IST

ETV Bharat / state

విజయవాడలో దిశ పోలీస్​ స్టేషన్​ ప్రారంభం

దిశ చట్టం ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు అభిప్రాయపడ్డారు. నగరంలో నూతన దిశ పోలీస్ స్టేషన్​ను దిశా ప్రత్యేకాధికారులు కృత్తికాశుక్లా, దీపిక ప్రారంభించారు.

dhisha police station started in Vijayawada
విజయవాడలో దిశ పోలీస్​ స్టేషన్​ ప్రారంభించిన అధికారులు

విజయవాడలో దిశ పోలీస్​ స్టేషన్​ ప్రారంభించిన అధికారులు

మహిళలకు భద్రతా భావాన్ని కల్పించటమే తమ లక్ష్యమని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. దిశ చట్టం ప్రత్యేకాధికారులు కృత్తికాశుక్లా, దీపికలు నగరంలో నూతన దిశ మహిళా పోలీస్ స్టేషన్​ను ప్రారంభించారు. బాధితులకు సత్వరన్యాయం చేసేందుకు ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 122 మంది ఫిర్యాదు చెయ్యగా.. 37 మందిపై ఎఫ్ఐఆర్​లు నమోదు చేసినట్లు కృత్తికాశుక్లా వెల్లడించారు. మహిళలకు ఇంకా ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఇంతియాజ్ అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details