ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్టీసీ ఒప్పంద కార్మికులకు శుభవార్త...క్రమబద్ధీకరణకు ఆదేశాలు

ఆర్టీసీలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

By

Published : Aug 30, 2019, 7:23 AM IST

ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీలో ఒప్పంద కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంస్థలో పనిచేస్తున్న సుమారు 1345 మంది కార్మికులను క్రమబద్ధీకరించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో సుమారు 918 మంది డ్రైవర్లు, 424 మంది కండక్టర్లు ఉన్నారు. ఆర్టీసీ ఐకాసతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఇప్పటికే 240 పనిదినాలు పూర్తి చేసుకున్న కార్మికులకు క్రమబద్ధీకరణ వర్తించనుంది. సెప్టెంబరు 15 నాటికి 240 పనిదినాలు పూర్తి చేసుకునేవారి జాబితా పంపాలని డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. జాబితాలు అందిన తర్వాత క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details