కరోనా ప్రభావంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించినా.. ప్రజలు మాత్రం అవసరాల నిమిత్తం రోడ్లపైకి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఓ వైపు నగరంలో కరోనా పాజిటివ్ కేసు నమోదవడంపై అంతటా ఆందోళన వ్యక్తమవుతున్నా.. విజయవాడలో చూస్తే పరిస్థితి ఇలా ఉంది. నిత్యావసరాల కొనుగోలు నిమిత్తమో.. ఇతర పనులో. కారణమేదైనా ప్రజలు మాత్రం మామూలు రోజుల్లో వస్తున్నట్టుగానే రోడ్లపై రాకపోకలు చేస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి అందిస్తారు.