దిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న కిసాన్ ట్రాక్టర్ ర్యాలీకి రాష్ట్ర విద్యార్థి సంఘాల నేతలు మద్దతు తెలిపారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొనేందుకు సుమారు 60 మంది విద్యార్థులు సింఘు సరిహద్దు వద్దకు వెళ్లారు. విద్యార్థులతో పాటు రాష్ట్ర రైతులూ.. కిసాన్ ర్యాలీలో పాల్గొన్నారు.
రైతులకు మద్దతు తెలిపేందుకు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చామని చెప్పారు. ఇప్పటికైనా.. కేంద్ర ప్రభుత్వం స్పందించాలని.. రైతుల డిమాండ్లకు అనుగుణంగా.. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.