ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీజీపీ చేతుల మీదుగా ఏబీసీడీ అవార్డులు ప్రదానం

మిస్టరీ కేసులను ఛేదించిన పోలీసులకు డీజీపీ సవాంగ్... ఏబీసీడీ అవార్డులు అందించారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన పోలీసులను ఆయన అభినందించారు.

By

Published : Aug 12, 2020, 7:36 PM IST

ABCD Awards presented to police in vijayawada
డీజీపీ చేతుల మీదుగా ఏబీసీడీ అవార్డులు ప్రదానం

ఆధారాలు దొరకక మిస్టరీగా మారిన కేసులను ఛేదించిన పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్.. ఏబీసీడీ అవార్డ్​లు అందజేశారు. ఈ సారి ప్రత్యేకంగా అట్రాసిటీ కేసులను ఛేదించి.. నిందితులకు శిక్ష పడేవిధంగా చేసిన పోలీసులకు ఈ అవార్డ్స్ లో స్థానం కల్పించారు.

ఏలూరులో సైనేడ్ తో హత్యచేసిన సీరియల్ కిల్లర్​ను చాకచక్యంగా పట్టుకున్న ఘటనకు, సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని గుర్తించి... నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులకు,కృష్ణాజిల్లా నూజివీడులో పదేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసును ఛేధించిన పోలీసులకు బహుమతులు లభించాయి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తే మిస్టరీ కేసుల్లో నిందితులను గుర్తించవచ్చని డీజీపీ సవాంగ్ తెలిపారు.

ఇదీచదవండి.
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ మళ్లీ వాయిదా

ABOUT THE AUTHOR

...view details