ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 10, 2022, 2:23 PM IST

ETV Bharat / state

మృత్యువును ఎవరు ఆపలేరు.. తాడి చెట్టు పడి, మోటర్ సైకిల్ పై వెళ్తున్నవ్యక్తి మృతి

FARMER DIED DUE TO TATICHETTU : టైం బాగోలేకపోతే తాడే పామై కరుస్తుందంటారు. మరణం ఏ రూపంలో కాటు వేస్తుందో ఎవరూ ఊహించలేరు. సరిగ్గా ఇక్కడ జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న ఓ వ్యవసాయ కూలీపై తాటిచెట్టు పడి మరణించాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

FARMER DIED DUE TO TATICHETTU
FARMER DIED DUE TO TATICHETTU

AGRICULTURAL LABORER DIED DUE TO PALM TREE : మృత్యువు ఏ సమయంలో.. ఏ రూపంలో వస్తుందో ఊహించటం చాలా కష్టం. సరిగ్గా ఇలాంటి ఘటనే కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. పొలం పని ముగించుకుని.. బైక్‌పై ఇంటికి వెళ్తుండగా.. తాటిచెట్టు పడి.. వ్యవసాయ కూలీ మృతి చెందాడు. కరప మండలంలోని గొర్రిపూడిలో సుబ్బరాజు అనే వ్యయసాయ కూలీ.. పొలం పనికి వెళ్లి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. సరిగ్గా మంత్రాల తూము వద్దకు వచ్చేసరికి తాటిచెట్టు మీద పడి.. తల నుజ్జునుజ్జు కావడంతో.. సుబ్బరాజు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కూలీ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

కాకినాడలో విషాదం.. తాటిచెట్టు పడి వ్యవసాయ కూలీ మృతి

ABOUT THE AUTHOR

...view details