ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మతిస్థిమితం లేని మహిళ.. చెరువులో స్నానానికి దిగి...

మతిస్థిమితం లేని ఓ మహిళ.. చెరువులోకి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి మరణించింది. ఈ ఘటన.. గుంటూరు జిల్లా అమర్తలూరు మండలంలోని కోరుతాడిపర్రులో జరిగింది.

By

Published : Jul 6, 2021, 2:07 PM IST

women death falling in pond
చెరువులో స్నానానికి దిగి మతిస్థిమితం లేని మహిళ మృతి

గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం కోరుతాడిపర్రులో మతి స్థిమితం లేని తాడిశెట్టి పద్మ (37) అనే మహిళ.. చెరువులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి మరణించింది. చెరువులోని మృతదేహాన్ని గమనించిన స్థానికులు.. కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు అక్కడకు చేరుకుని.. మృతదేహాన్ని బయటకు తీశారు. పద్మకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవటంతో ఐదేళ్ల క్రితం భర్త వదిలేశాడు. పిల్లలు కూడా తండ్రి వద్దే ఉంటున్నారు. దీంతో పద్మ తన సోదరుని వద్ద ఉంటోంది. స్నానం చేసేందుకు ఊరిలోని చెరువు వద్దకు వెళ్లగా.. ప్రమాదవశాత్తు అందులో మునిగి మరణించి ఉంటుందని కుటుంబసభ్యులు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details