ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పగలు చూస్తారు.. రాత్రి దోచేస్తారు..

By

Published : Sep 1, 2020, 12:00 PM IST

Updated : Sep 1, 2020, 2:11 PM IST

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల జంక్షన్​లోని దుకాణాల్లో చోరీకి పాల్పడ్డ దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల పేరిచర్ల జంక్షన్​లో ఉన్న మూడు దుకాణాల తాళాలు పగలగొట్టి.. సుమారు 20 వేల రూపాయలు దొంగిలించారు.

robbery at medikonduri
పగలు చూస్తారు.. రాత్రి దోచేస్తారు..

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల జంక్షన్​లోని మూడు దూకాణాల్లో చోరీకి పాల్పడ్డ దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 26న పేరిచర్ల జంక్షన్​లో ఉన్న మూడు దుకాణాల తాళాలు పగలగొట్టి.. సుమారు 20 వేల రూపాయలు దోచుకున్నారు.

ఫిరంగిపురం మండలం గొల్లపాలెేనికి చెందిన నక్క జ్యోతి బాబు.. గుంటూరు మిర్చి యార్డ్ సమీపంలో ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన నారాబోయిన రమేశ్​తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు పగలు వీధుల వెంట తిరుగుతూ ప్లాస్టిక్ వ్యాపారం చేస్తూ.. దుకాణాలు ఎంచుకుంటారు. రాత్రి వీలు చూసుకుని ఆ దుకాణాల్లో చోరీ చేస్తారు.

ఇదీ చదవండి: ఎఫ్​ఆర్​బీఎం పెంపుపై ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ప్రభుత్వం

Last Updated : Sep 1, 2020, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details