శారదా పీఠంలో ఉత్తరాధికార బాధ్యత స్వీకరణ వేడుక
విశాఖ శారదా పీఠ ఉత్తరాధికార శిష్య తురియాశ్రమ దీక్ష మహోత్సావాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఈనెల 17 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. శిష్యుడు బాలస్వామికి సన్యాస దీక్షను స్వరూపానంద ప్రసాదించనున్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో.. విశాఖ శారదా పీఠ ఉత్తరాధికార శిష్య తురియాశ్రమ దీక్ష మహోత్సావాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో... ఈనెల 17 వరకు వేడుకలు జరగనున్నాయి. మొదటి రోజు ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించనున్న బాలస్వామితో.. స్వరూపానంద స్వామి సన్యాసాంగ, దశవిధ స్నానాలు, కూష్మాండా, యాగాలు చేయించారు. అనంతరం సచ్చిదానంద ఆశ్రమంలో ఏర్పాటు చేసిన రాజ శ్యామల అమ్మవారికి.. స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శాసనసభ్యుడు మల్లాది విష్ణు, విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు, దుర్గగుడి ఆలయ ఈవో కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.