ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉద్దండరాయునిపాలెం వద్ద ఉద్రిక్తత.. రైతులను అడ్డుకున్న పోలీసులు

By

Published : Oct 21, 2020, 3:58 PM IST

గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెం వద్ద రాజధాని నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన ప్రాంతంలో రైతులు తుప్పలు, పిచ్చిమొక్కలను తొలగించడానికి వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

police blocked farmers at uddandarayunipalem
ఉద్దండరాయునిపాలెం వద్ద ఉద్రిక్తత

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజధాని నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పిచ్చి చెట్లు, ముళ్లకంపను తొలగించేందుకు వెళ్లిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు.

అనుమతి లేకుండా రావొద్దని పోలీసులు చెప్పగా.. రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా వస్తోందన్న సమాచారంతో పోలీసులు వెనక్కి తగ్గారు. రైతులు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఉన్న పిచ్చి మొక్కలను, కంపను తొలగించారు.

ABOUT THE AUTHOR

...view details