ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా పాదయాత్రలో ఘర్షణ

బాబు మళ్లీ సీఎం కావాలంటూ చేసిన పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వర్గానికి , వ్యతిరేక వర్గానికి మధ్య గొడవకు ఈ ర్యాలీ దారితీసింది.

By

Published : Feb 19, 2019, 2:36 PM IST

తెదేపా పాదయాత్రలో ఘర్షణ

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలంటూ జడ్పీ. వైస్.ఛైర్మన్ పూర్ణచందర్​రావు ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్​కుమార్ దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే వర్గీయులు పాదయాత్ర అడ్డుకోవడం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇది ఎవ్వరికీ వ్యతిరేకంగా చేసే ర్యాలీ కాదని పూర్ణచందర్ తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు.

గుంటూరు తెదేపాలో వర్గపోరు

ABOUT THE AUTHOR

...view details