ప్రతిపక్షనేత జగన్పై మంత్రి లోకేశ్ ట్విటర్ ద్వారా విమర్శలు కురిపించారు. హైదరాబాద్లో తమ పార్టీ డేటా చోరీ చేశారని.. హైదరాబాద్లోనే ఆ డేటానుజగన్కు అందించారని ఆరోపించారు. ఇది అప్రజాస్వామికం కాదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ వైకాపా కాల్ సెంటర్ నుంచే ఏపీలోని టీడీపీ కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేసే కాల్స్ వస్తున్నాయన్నారు.ఇది చట్టాల ఉల్లంఘన కిందకు రాదా? అని నిలదీశారు. ఇన్ని అక్రమాలు హైదరాబాద్లోనే జరుగుతున్నాయన్నారు. ఇలాంటి చర్యలపైతెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, కేసీఆర్... జోడి అనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదన్నారు.
ఇవీ చదవండి