దేశంలో ఎక్కడా లేని విధంగా... ప్రతిపక్షాలు అసూయపడేలా మంగళగిరి నియోజకవర్గాన్నిఅభివృద్ధి చేస్తానని మంత్రి లోకేశ్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసినఆయన... రాష్ట్రంలో ఇప్పటి వరకు 24 వేల కిలోమీటర్ల మేర సీసీరోడ్లు పూర్తి చేశామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మంగళగిరితో పాటు రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు మంజూరయ్యే విధంగా చర్యులు తీసుకుంటామన్నారు.