గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ మంజూరు చేయడంపై ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్కు అభినందలు తెలిపారు.పిడుగురాళ్లలో ఆయను మీడియాతో మాట్లాడారు.భారీ మెజార్టీతో గెలిపించి అధికారం ఇచ్చిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. మెడికల్ కళాశాల ఎక్కడ ఏర్పాటు చేయాలనేది నిపుణుల కమిటీ నిర్ణయిస్తుందన్నారు. సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రాంతంలో కాలేజీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
"పల్నాడు అభివృద్ధికి కృషి చేస్తాం"
పల్నాడును చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తామని గురజాల శాసన సభ్యుడు కాసు మహేశ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో మెడికల్ కాలేజీ కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.
చరిత్రలో నిలిచిపోయే విధంగా పల్నాడు అభివృద్ధి చేస్తా: కాసు మహేష్ రెడ్డి