ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లాయర్లను పోలీసులు బెదిరిస్తున్నారనడం సమంజసమా?'

న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తున్నారనడం ఎంతవరకు సమంజసం అని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విషయంపై మాట్లాడారు.

By

Published : Oct 9, 2020, 12:00 AM IST

న్యాయవాదులే కోర్టుకు పిలిచి మొట్టికాయలేయిస్తున్నారు: సుచరిత
న్యాయవాదులే కోర్టుకు పిలిచి మొట్టికాయలేయిస్తున్నారు: సుచరిత

అక్రమ నిర్బంధం విషయంలో పిటిషన్ ఉపసంహరించుకోవాలని న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించిందంటూ.. మీడియా ప్రతినిధులు హోం మంత్రి సుచరిత దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఆ విధంగా చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

స్పందించిన హోం మంత్రి.. న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తే ఊరుకుంటారా? అని తిరిగి ప్రశ్నించారు. న్యాయవాదులను పోలీసులు బెదిరిస్తున్నారనడం ఎంతవరకు సమంజసం అన్నారు.

ABOUT THE AUTHOR

...view details