వేలాది వాహనాలతో పెరుగుతున్న పొగ కాలుష్యాన్ని నియంత్రించటానికి మొక్కలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కానీ రోజురోజుకు రోడ్లు పెంచే పేరుతో, ట్రిమ్మింగ్ పేరుతో మెుక్కలను తొలగించేస్తున్నారు. 'పచ్చదనాన్ని పెంచండి, కాలుష్యకారిక ప్రమాదపు వాతావరణాన్ని నివారించండి' అంటూ.. ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. గుంటూరు నగర పాలకసంస్థ చెట్లను కొట్టేస్తోంది. నగరంలోని ప్రధాన రహదార్లలో పెంచిన మొక్కలు ట్రిమ్మింగ్ పేరుతో మోడువారుతున్నాయి. గుంటూరు నగరంలోని అరండల్ పేట-బ్రాడీపేట రహదారి మార్గం బోసిపోయి కనిపిస్తోంది. మొక్కలను ఇలా నరకటంపై పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హరిత'హతం'... పచ్చని మొక్కలపై రంపపుపోటు!
ఓ పక్క పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కలిగే అనర్ధాలను చూస్తూనే(వింటూనే) ఉన్నాం. కానీ.. పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. గుంటూరు నగరపాలక సంస్థ అధికారుల తీరు సగటు మనిషిని ఆగ్రహానికి గురిచేస్తోంది.
నగరాల్లో పచ్చదనం దూరమవుతోంది