ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో కొత్తగా 498 కరోనా కేసులు.. నలుగురు మృతి

గుంటూరు జిల్లాలో ఈరోజు కొత్తగా 498 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో మరో నలుగురు మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 56,294కు చేరింది.

By

Published : Sep 30, 2020, 7:58 PM IST

guntur district corona cases
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 498 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో కేసుల సంఖ్య 56,294కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరులో 71, నరసరావుపేటలో 64 కేసులు నమోదయ్యాయి.

మండలాల వారీగా నమోదైన కేసుల వివరాలు

తెనాలి-53, సత్తెనపల్లి-52, బాపట్ల-26, తాడేపల్లి-17, మంగళగిరి-16, వినుకొండ-15, పొన్నూరు-14, నకరికల్లు-14, కొల్లిపర-14, కొల్లూరు-13, తాడికొండ-12, రేపల్లె-12, వేమూరు-12 చొప్పున కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 48,422 ఇంటికి చేరుకున్నారు.

వైరస్ ప్రభావంతో ఇవాళ గుంటూరు జిల్లాలో నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 531కి చేరింది. రాష్ట్రంలో కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభంవిచిన జిల్లాలో గుంటూరు రెండో స్థానంలో ఉంది.

ఇవీ చదవండి:

'ఆ లేఖను తేలిగ్గా తీసుకోం.. సరైన చోట తేల్చుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details