ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో ఇవాళ 10 కేసులు.. మొత్తం 373

గుంటూరు జిల్లాలో ఈరోజు నమోదైన 10 కరోనా పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం కేసులు 373కు చేరుకున్నాయి. ఇందులో 150 మంది డిశ్చార్జ్ కాగా.. 8 మంది మృతిచెందారు.

By

Published : May 7, 2020, 6:10 PM IST

corona cases in guntur district
గుంటూరు జిల్లాలో ఇవాళ 10 కేసులు.. మొత్తం 373..

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. ఇవాళ మరో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 373కు చేరింది. గుంటూరు అర్బన్ పరిధిలోని అహ్మద్ నగర్లో 5 కేసులు, సంగడిగంట, గుంటూరువారితోట, కుమ్మరి బజార్​లో ఒక్కో కేసు చొప్పున వెలుగుచూశాయి. తాడేపల్లిలో మరో 2 కేసులు పాజిటివ్​గా నిర్ధరించారు.

నరసరావుపేటలో ఇవాళ ఒక్క కేసు నమోదు కాకపోవడం ఉపశమనం కల్గించే అంశం. ఈరోజు 21 మంది డిశ్చార్జయ్యారు. జిల్లాలో ఇప్పటివరకు 373 కేసులు నమోదైతే... అందులో 150 మంది డిశ్చార్జ్ కాగా.. మరో 215 మంది చికిత్స పొందుతున్నారు. 8 మంది మృతిచెందారు.

ఇవీ చదవండి.. కరోనా కట్టడికి చతుర్ముఖ వ్యూహం

ABOUT THE AUTHOR

...view details