ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగన్ వస్తే సాగర్ నుంచి చుక్క నీరు రాదు'

ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో తెదేపా రోడ్​షోకు హాజరయ్యారు. తెలుగుదేశానికి ఓటేస్తే ఏడాదికి కనీస ఆదాయం రెండు లక్షలు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు.

By

Published : Apr 9, 2019, 3:15 PM IST

చంద్రబాబు రోడ్ షో

చంద్రబాబు రోడ్ షో

వైకాపాకు ఓటేస్తే రాజధాని నిర్మాణం ఆగిపోతుందని రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. జగన్ ముఖ్యమంత్రి అయితే.. సాగర్‌ నుంచి చుక్క నీరు రాష్ట్రానికి రాదని అన్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో తెదేపా రోడ్​షోకు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి జగన్‌ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన వాటా అడిగితే మనపైనే దాడిచేసున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై వైకాపా, తెరాస నాటకాలాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు . తెలుగుదేశానికి ఓటేస్తే....ఏడాదికి కనీస ఆదాయం రూ.2 లక్షలు వచ్చేలా చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details