ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోటయ్య కుటుంబానికి 'లక్ష'

గుంటూరు జిల్లా కొండవీడు ఉత్సవాల సమయంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కోటయ్య కుటుంబాన్ని జనసేన నేత రావెల కిషోర్​ బాబు పరామర్శించారు. పార్టీ తరపున లక్ష రూపాయల సాయాన్ని అందించారు.

By

Published : Feb 20, 2019, 3:45 PM IST

కోటయ్య కుటుంబానికి జనసేన ఆర్థిక సాయం

గుంటూరు జిల్లా కొండవీడు ఉత్సవాల సమయంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని జనసేన పార్టీ తరపున రావెల కిషోర్​ బాబు పరామర్శించారు. పోలీసుల వేధింపులతోనే కోటయ్య ఆత్మహత్య చేసుకున్నాడని రావెల ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వ వైఫల్యమేకారణమన్నారు. న్యాయ విచారణకు డిమాండ్​ చేశారు. కోటయ్య కుంటుంబానికి కోటి రూపాయలు, ఒక ఎకరం భూమి, మృతుని కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. బాధితకుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద జనసేన పార్టీ తరపున లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.

కోటయ్య కుటుంబానికి జనసేన ఆర్థిక సాయం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details