ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 30, 2019, 12:35 AM IST

ETV Bharat / state

గ్యాస్ లీక్ చేసుకుని వ్యక్తి ఆత్మహత్య

గ్యాస్ లీక్ చేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరులో జరిగింది. మానసిక స్థితి సరిగ్గా లేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని అరండల్ పెట్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/29-November-2019/5218682_276_5218682_1575043942516.png
a person suicide with gas in guntur

గుంటూరులో గ్యాస్ లీక్ చేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలవరపరించింది. స్థానిక భారత పేట 4వ లైన్​లో రావుల వర ప్రసాద్​ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో ప్రసాద్ తన తల్లిని ఫంక్షన్ దగ్గర వదిలి వచ్చాడు. ఏకాంతంగా ఉన్న ప్రసాద్ గ్యాస్ సిలిండర్ లీక్ చేసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అరండల్ పెట్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. వర ప్రసాద్​ మానసిక స్థితి సరిగ్గా లేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచరణలో తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. ఆరోగ్యం సరిగ్గా లేక గతంలో పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు.

గ్యాస్ లీక్ చేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details