ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 5, 2021, 7:56 PM IST

ETV Bharat / state

missing: ఏలేరు కాలువలో యువకుడు గల్లంతు..

మిత్రులతో కలిసి స్నానం కోసం కాలువలోకి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కోలులోని ఏలేరు కాలువలో ఈ ఘటన జరిగింది.

missing
ఏలేరు కాలువలో యువకుడు గల్లంతు

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కో లు వద్ద ఏలేరు కాలువలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. కాకినాడ గొడారి గుంట ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు ఏలేరు రెగ్యులేటరీ వద్ద స్నానానికి దిగారు. ఈ క్రమంలో మహేశ్​ అనే యువకుడు నీటిలో గల్లంతు అయ్యాడు. తరచూ ఈ ప్రాంతంలో యువత మద్యం తాగడం, స్నానానికి దిగడం, గల్లంతై ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు తెలిపారు. అయినా యువతలో ఎలాంటి మార్పు రావడం లేదని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details