ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 21, 2021, 12:58 PM IST

ETV Bharat / state

మద్యం దుకాణంలో చోరీ..రూ.3 లక్షలు దోచుకెళ్లిన దుండగులు..

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెల ప్రభుత్వ మద్యం దుకాణంలో దొంగతనం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దుండగులు తాళాలు పగలగొట్టి రూ. 3 లక్షల నగదును అపహరించారు.

theft at liquor shop at palivela
మద్యం దుకాణంలో చోరి

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెల ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు దుకాణంలోని రూ.3 లక్షల నగదును అపహరించారు. ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దుకాణం వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డును బెదిరించి తాళాలు పగలగొట్టారు. దుకాణంలో ఉన్న రూ.3 లక్షలు దోచుకెళ్లారు. ఆదివారం అమ్మిన మద్యం డబ్బులు.. బ్యాంకులో వేయడానికి వీలు లేనందున.. దుకాణంలోనే ఉంచినట్లు సిబ్బంది చెబుతున్నారు. కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు.

మద్యం దుకాణంలో చోరి

ABOUT THE AUTHOR

...view details