ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీ ఉమా మూలేశ్వర స్వామి వారి దర్శనం రద్దు

By

Published : Jul 20, 2020, 7:12 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో శ్రీ ఉమా మూలేశ్వర స్వామి వారి ఆలయంలో దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ఆర్ కృష్ణ ప్రకటించారు. కరోనా కట్టడి చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

east godavari district
శ్రీ ఉమా మూలేశ్వర స్వామి వారి దర్శనం రద్దు

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నాలుగు కేసులు నమోదు కావటంతో ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ లుగా అధికారులు ప్రకటించారు.

ఈ కారణంగా.. మండలంలోని శ్రీ ఉమా మూలేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలను రద్దు చేస్తున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ఆర్ కృష్ణ వెల్లడించారు. నిత్యం ఆది దంపతులకు ఏకాంత సేవ, కైంకర్యాలు యథావిధిగా జరుగుతాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details